అమృత తల్లి కూడా దోషియే.. !

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో అమృత తండ్రి మారుతి రావు, ఆయన సోదరుడు శ్రావణ మాత్రమే నిందితులుగా భావించారు. వీరి సుపారి మేరకు కిరాయి గుండాలు ప్రణయ్ ని హతమార్చారని తెలిసింది. ఐతే, సుపారి తీసుకొంది కిరాయి హంతకులు కాదు. ఉగ్రవాదులు అనే విషయం షాకింగ్ కు గురి చేస్తుంది.

అంతేకాదు.. అమృత తల్లి కూడా దోషియేనట. హత్యకు రెండు వారాల ముందు నుంచి అమృత వర్షిణికి ఫోన్ చేయడం ప్రారంభించిన ఆమె తల్లి, మెత్తగా, నమ్మకంగా మాట్లాడి, వారి గురించి ఆరా తీశారని ఆరోపించారు. నల్లపూసల గొలుసు చేయించానని, కొత్త బట్టలు పంపుతానని చెబుతూ, వారు ఎక్కడికి వెళుతున్నారన్న వివరాలను సేకరించి, తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ప్రణయ్ తల్లి ప్రేమలత ఆరోపిస్తున్నారు.