పండగ పుట ఘోర విషాదం చోటు చేసుకుంది. పంజాబ్లోని అమృత్సర్లో రావణ దహన వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. నవరాత్రి వేడుకల్లో భాగంగా స్థానికులు జోదా ఫటక్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్కు సమీపంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే సమయంలో రైలు రావడంతో పెను ప్రమాదం జరిగింది.
ట్రాక్పై నిలుచుకున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దసర ఉత్సవాల్లో భాగంగా రావణ దహనం చేస్తుండగా.. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ శబ్దాలకు రైల్వే ట్రాక్పై నిల్చున్నవారు అటువైపుగా రైలు వస్తున్నట్టు గుర్తించలేకపోయారు. దీంతో పెనుప్రమాదం చోటుచేసుకుందని స్థానికలు చెబుతున్నారు.