రసెల్’కు వేధింపులు

కోల్ కతా నైట్ రైడర్స్ కు దొరికిన మిస్సైల్.. ఆండ్రీ రస్సెల్. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో కోల్ కతాకు ఒంటిచేత్తో విజయాలను అందిస్తున్నాడు. ఐతే, రసూల్ కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యంపై అంత సంతృప్తిగా లేనట్టు తెలుస్తోంది. గతంలో కేకేఆర్ యాజమాన్యం తనను ఏడిపించిదంటూ సంచలన విషయాన్ని బయటపెట్టాడు రసూల్. జట్టు యాజమాన్యం తనని ఏడిపించింది.

2017లో అంతర్జాతీయ క్రికెట్ నుండి రసెల్ నిషేధానికి గురయ్యాడు. ఆ యేడాది ఐపీఎల్ కూడా ఆడలేదు. ఆ సమయంలో కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ నుండి ఫోన్ వచ్చింది. జట్టు మొత్తం నీకు మద్దతుగా వుంటామంటూ ధైర్యానిచ్చారు. ఆయన ఆ మాటలను విన్న వెంటనే తనకు ఏడుపు ఆగలేదు. చిన్నపిల్లాడిలా గుక్కపట్టి మరీ ఏడ్చానని స్వయంగా రస్సెల్స్ బయటపెట్టాడు.