కమ్ముకున్న వాయు యుద్ధం


తీవ్ర ప్రతీకార దాడి తప్పదని ఇరాక్, ఇరాన్ ప్రకటన చేసినా లెక్కచేయకుండా అమెరికా మరోసారి దాడి చేసింది. దీంతో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పర్యవసానంగా విమానయాన సంస్థలకు భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇరాన్‌ గగనతలానికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిసింది. దీంతో ఎయిరిండియా, ఇండిగో వంటి సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. భారత్‌ నుంచి అమెరికా, పశ్చిమాసియా, యూరప్‌ వెళ్లే విమానాలను విమానయాన సంస్థలు తాత్కాలికంగా దారి మళ్లించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది