తిత్లీ తుఫాన్ బాధితులకు బాలకృష్ణ భారీ సాయం..

ఇటీవల శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల్లో వచ్చిన తిత్లీ తుఫాన్ ఎంతటి నష్టం చేసిందో తెలియంది కాదు..వేలాది ఎకరాలకు నష్టం వాటిల్లడం తో పాటు ఎన్నో ఇల్లులు నేల మట్టం అయ్యాయి. దీంతో బాధితులంతా తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక బాదితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో పాటు సినీ ప్రముఖులు సైతం నడుం బిగించారు. తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, నిఖిల్ లాంటి హీరోలంతా తమ వంతు సహాయం ప్రకటించగా తాజాగా సినీ నటుడు , టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడ తన వంతుగా భారీ సహాయాన్ని ప్రకటించారు. నిర్వాసితులైన ప్రజలను, పంట నష్టం జరిగిన రైతుల్ని ఆదుకోవడానికి ఆయన 25 లక్షల సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ అనే బయోపిక్ లో నటిస్తున్నాడు. తారకరామారావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నాడు.