సోమవారం లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్తున్న ఎంఎంటీఎన్ రైలు, కర్నూలు నుంచి సికింద్రాబాద్ వస్తున్న హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కాచిగూడ రైల్వేస్టేషన్లో ఒకే లైన్లో ఎదురెదురుగా ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడగా..ఎంఎంటీఎస్ రైలు లోకో పైలట్ చంద్రశేఖర్ రెండు రైళ్ల మధ్య ఇరుక్కొని తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రస్తుతం ఈయన ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్స్ చెపుతున్నారు. ఇతడికి వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. లోకో పైలట్ చంద్రశేఖర్ కాళ్లకు రక్త ప్రసరణ తగ్గిందని, పక్కటెముకలు, మూత్రపిండం దెబ్బతిన్నాయని కేర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుష్మ తెలిపారు.