చిన‌జీయ‌ర్ స్వామి ఇంట్లో విషాదం ..

త‌్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన త‌ల్లి అలివేలుమంగ(85) క‌న్నుమూశారు. గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆమె శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల స‌మ‌యంలో తుదిశ్వాస విడిచారు.

దీంతో చిన‌జీయ‌ర్ స్వామి తీవ్ర దిగ్ర్భాంతికి గుర‌య్యారు. తల్లి మంగతాయారు అంటే ఎంతో ప్రేమాభిమానాలు కలిగివుండేవారు చినజీయర్ స్వామి. ఆమె పరమపదించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. తల్లితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు శంషాబాద్ ముచ్చింత‌ల్‌లోని చిన‌జీయ‌ర్ ఆశ్ర‌మం స‌మీపంలో అలివేలుమంగ అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.