అఫ్గాన్తో మ్యాచ్లో టీమిండియా 11 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో హైలెట్ మహ్మద్ షమి ఆఖరి ఓవర్లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టడం, అయితే అతడి హ్యాట్రిక్ వెనక టీమిండియా మాజీ కెప్టెన్, వ్యూహకర్త మహేంద్రసింగ్ ధోనీ పాత్ర కీలకంగా మారింది. అ
ఆఖరి ఓవర్ బౌలింగ్ వేయడానికి వచ్చిన షమి తొలి బంతిని ఫుల్లెంగ్త్ యార్కర్కి ప్రయత్నించాడు. అది లో ఫుల్టాస్గా వెళ్లడంతో నబీ బంతిని లాంగ్ ఆన్ దిశగా బౌండరీ తరలించాడు. ఇక ఐదు బంతుల్లో 12 పరుగులుగా సమీకరణం మారింది. దీంతో బౌలర్ షమిపై ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలోనే ధోనీ తన వ్యూహాన్ని అమలు చేశాడు. వరుసగా మూడు వికెట్లు. మ్యాచ్ ఖతమ్.