ధోని అభిమానుల్లో టెన్షన్


మహేంద్రసింగ్ ధోనీ అభిమానులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. ట్విటర్లో ట్రెడింగ్ లో ఉన్న ఓ హ్యాష్ ట్యాగే ఇందుకు కారణం. ”ధోనీ రిటైర్స్’ మంగళవారం ఉదయం నుంచి ఇది టాప్ 10లో ఉంది. దీంతో ఈ రోజు ధోనీ ఆటకు వీడ్కోలు పలుకుతున్నాడంటూ వదంతులు వస్తున్నాయి.

ఇంగ్లాండ్‌ వేదికగా ముగిసిన ప్రపంచకప్‌ అనంతరం ధోని ఇప్పటివరకు మైదానంలో అడుగుపెట్టలేదు. ప్రపంచకప్‌ టోర్నీ ముగిసిన తర్వాత తొలి రెండు నెలలు ఆర్మీకి సేవలందించాలనే ఉద్ధేశ్యంతో రెండు నెలలు క్రికెట్‌కు విరామమిచ్చాడు. ఆర్మీ ట్రైనింగ్‌ ముగిసిన అనంతరం కూడా ధోని తిరిగి టీమిండియాలో చేరలేదున. ఐతే వీడ్కోలు వార్తలను ఖండిస్తున్నారు అభిమానులు. అంతేకాకుండా అతడికి మద్ధతుగా నిలుస్తూ నెవర్‌ రిటైర్‌ ధోని హ్యాష్‌ ట్యాగ్‌ను జోడిస్తున్నారు.