ఐపీఎల్ మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. మార్చి 23న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నైసూపర్కింగ్స్, రాయల్ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ అధికారిక ట్విటర్లో ఆసక్తికర ప్రచార వీడియోను విడుదల చేసింది.
ఐపీఎల్ విడుదల చేసిన టీజర్ అందరినీ ఆనందంలో ముంచెత్తుతోంది. అభిమానులు ఈ మెగా లీగ్ కోసం ఎంత ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారో.. తమ అభిమాన క్రికెటర్లపై పెట్టుకున్న అంచనాలు ఈ టీజర్లో కనిపిస్తాయి. అంతేకాకుండా టీమిండియా సారథి విరాట్ కోహ్లికి సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని ఇచ్చే స్వీట్ వార్నింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది