గోల్కొండలో జెండా ఆవిష్కరించిన కేసీఆర్..

దేశ వ్యాప్తంగా 72వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యం లో హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎందరో మహానుభావుల త్యాగఫలమే స్వాతంత్య్రమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహించిన 72వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.