గుడ్ న్యూస్ : రూ.153లకే 100 ఛానెల్స్

టీవీ ప్రేక్షకులకి ట్రాయ్ (టెలీకామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 153.40లకే 100 ఛానెల్స్ అందించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకొంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ ప్యాకేజ్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించింది. కేబుల్ కనెక్షన్ ఉన్నా, DTH అయినా 100 ఛానళ్లను ఇదే ధరకు అందించాలని సర్వీస్ ప్రొవైడర్లకు సూచించింది.

ఇంతకుముందు ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల కారణంగా వినియోగదారులు నెలకి రూ. 400 – 450 కేబుల్ బిల్లు కట్టాల్సి ఉంటుంది. తెలుగు ప్యాకేజ్ ఛానెల్స్ కావాలంటే రూ. 283 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడీ నిబంధనలని సడలించి రూ. 153కే 100 ఛానెల్స్ ప్యాకెజ్ ని తీసుకొచ్చి.. టీవీ ఛానెల్స్ కి ఉపశమనం కలిగించింది.