బ్రెజిల్ లో తుపాకుల మోత వినిపించింది. బ్రెజిల్లోని పారా రాష్ట్రం బెలెమ్ నగరంలోని ఓ బార్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కార్లు, బైక్లపై వచ్చిన ఏడుగురు సాయుధ దుండగులు బార్లోకి ప్రవేశించి అక్కడి వారిపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు మృతిచెందినట్లు సమాచారమ్.
దుండగులు కాల్పులు జరిపి పారిపోతుండగా.. పోలీసులు వారిని వెంబడించారు. ఓ నిందితుడిని పట్టుకోగా.. మిగిలినవారు పరారయ్యారు. ఈ ఘటనని బ్రెజిల్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. త్వరలోనే దుండగులని పట్టుకొంటామని పోలీసులు తెలిపారు.