డేరా బాబాకు జీవిత ఖైదు


సిర్సాకు చెందిన జర్నలిస్టు ఛత్రపతిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కు యావజ్జీవ శిక్ష పడింది. డేరా బాబాతో పాటు దోషులుగా తేలిన మరో ముగ్గురు కుల్దీప్ సింగ్, నిర్మల్ సింగ్, కృషన్ లాల్ కు జీవిత ఖైదు విధిస్తున్నట్టు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు నిచ్చింది.

కాగ అత్యాచారం కేసులో గుర్మీత్‌ ఇప్పటికే 20ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. హరియాణాలోని రోహ్‌తక్‌ సునారియా జైల్లో ఖైదీగా ఉన్నాడు. అత్యాచారం కేసు తీర్పు సమయంలో పంచకులలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగి దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ రోజు కోర్టు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.