మళ్లీ తెర పైకి డ్రగ్స్..

గత కొన్ని నెలలుగా హైదరాబాద్ వార్తల్లో డ్రగ్స్‌ అనే మాట వినిపించలేదు.. కానీ మరోసారి డ్రగ్స్‌ అనే మాట వినిపించింది. తాజాగా భారీ డ్రగ్స్‌ ముఠా గుట్టును అధికారులు రట్టు చేయడం తో అందరూ షాక్ అయ్యారు. సంపన్నుల పిల్లలకు డ్రగ్స్ విక్రయిస్తున్న అబ్దుల్‌ అనే వ్యక్తిని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు.

గత నాలుగేళ్లగా దాదాపు 27 మంది ప్రముఖుల పిల్లలకు అబ్దుల్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. నగరంలో ‘టూర్స్ అండ్ ట్రావెల్స్‌’ నడుపుతున్న అబ్దుల్‌.. గోవాలోని మాక్స్‌ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్‌ తీసుకొస్తున్నట్టు గుర్తించారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని వ్యాపారవేత్తల పిల్లలకు అబ్దుల్‌ డ్రగ్స్‌ విక్రియంచినట్టు అధికారులు మీడియా కు చెప్పుకొచ్చారు. వాట్సాప్‌ ద్వారా లావాదేవీలు నడిపాడని , ఇతడి వద్ద 30 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

గత ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ డ్రగ్స్ మాఫియా లో చిక్కుకొని సంగతి తెలిసిందే. దాదాపు 12 మందిని అధికారులు ఈ డ్రగ్స్ వ్యవహారం ఫై విచారణ జరపడం , వారికీ సరఫరా చేసే వారిని అదుపులోకి తీసుకోవడం చేయడం తో అప్పటినుండి డ్రగ్స్ వ్యవహారం మళ్లీ తెరపైకి రాలేదు. మళ్లీ ఇన్ని నెలలకు మరోసారి డ్రగ్స్ వ్యవహారం బయటపడింది.