హైదరాబాద్ లో భారీ వర్షం ..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు మొదలైన వర్షం తెల్లవారు జాము వరకు కురిసింది. ఉదయం వర్షం తేరుకోవడంతో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని చోట్ల చిరు జల్లులు కురుస్తున్న వారి వారి పనులకు వెళ్లడం చేసారు.

సికింద్రాబాద్‌, బేగంపేట, సనత్ నగర్‌, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, ఎల్‌బీనగర్‌, ఉప్పల్‌, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం నుంచే ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖా తెలియజేసింది. సముద్ర వేటకు కూడా వెళ్లోద్దని హెచ్చరించింది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఎప్పటికప్పుడు వర్షాల గురించి ఆరా తీస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.