ఫస్ట్ టెస్ట్ : అదరగొట్టిన ఓపెనర్లు

భారత్-దక్షిణాఫ్రికా సిరీస్ ప్రారంభమైంది. విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సుదీర్ఘ ఫార్మాట్లో తొలిసారి ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అద్భుతమైన అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. కొత్త ఆశలు రేపుతున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్పిన్నర్లపై దూకుడు ప్రదర్శిస్తున్నాడు. భారీ సిక్సర్ బాది అర్ధశతకం సాధించాడు. వీరిద్దరూ మాంచి సమన్వయం ఆడుతున్నారు.

భారత జట్టు వివరాలు ఇలా వున్నాయి.

భారత్: రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, కోహ్లీ, అజింక్యా రహానే, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, ఇశాంత్ శర్మ, మొహమ్మద్ షమీ.