బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగిపోవడంతో భారత్ 8 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. . కెప్టెన్ రోహిత్ శర్మ (43 బంతుల్లో 85; 6×4, 6×6) అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును గెలుపు బాటలో నిలపగా, కేఎల్ రాహుల్ (8), శ్రేయాస్ అయ్యర్ (24) మరో 26 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ను ఫినిష్ చేశారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 31 పరుగులతో రాణించాడు. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది.