టి20 సిరీస్ భారత్ కైవసం


బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్‌ ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాపై 30 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సొంత గడ్డపై భారత్‌ సీరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

భారీ లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా జట్టును మీడియం పేసర్ దీపక్ చహర్ బంగ్లాను ఆరంభంలోనే దెబ్బతీశాడు. చహర్ దాటికి 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా, నయీం మెరుపుదాడితో బంగ్లా కోలుకుంది. నయీం 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు. మొత్తమ్మీద పరుగుల వేటలో బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది.