జయహో ధోని.. జయహో


మహేంద్ర సింగ్‌ ధోని గొప్పతనం గురించి దేశం మరోసారి మాట్లాడకుటుంది. ధోని మీద మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. మొన్న మ్యాచ్ లో ఓ వ్యక్తి భద్రత సిబ్బందిని దాటుకుని మైదానంలోకి వెళ్లాడు. ధోని దగ్గరికెళ్లి పాదాభివందనం చేశాడు. ఐతే అతను కిందికి వంగే క్రమంలో చేతిలో ఉన్న భారత జాతీయ జెండా కింద పడబోతుంటే.. ధోని చురుగ్గా స్పందించి దాన్ని చేతికి తీసుకోవడంతో అతడిపై ప్రశంసల జల్లు కురిస్తోంది.

‘నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మహీ. నువ్వు యువతకు ఆదర్శం. దేశభక్తికి ప్రచార కర్తలాంటి వాడివి. ఒక మ్యాచ్‌లో నువ్వు కోట్ల మంది హృదయాలను గెలుచుకోవడమే కాక, వారి మనోభావాలను కాపాడావు. మైదానంలో ఎంతో క్రమశిక్షణ చూపావు” అని నెటిజన్స్ ట్వీట్స్ చేశారు. మొత్తంమ్మీద మొన్నటి మ్యాచ్ ఓడిపోయినా ధోని మాత్రం దేశం గర్వపడేలా చేశాడు. దేశభక్తి స్ఫూర్తి చాటాడు.