తెలుగు విద్యార్థి ని చంపిన వాడ్ని చంపేశారు..

అమెరికాలోని గన్ కల్చర్ కు మరో తెలుగు విద్యార్థి శరత్ చనిపోయిన సంగతి తెల్సిందే. వరంగల్‌కు చెందిన శరత్‌ కొప్పుల (26) ఆరు నెలల క్రితం ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు..ఓ పక్క చదువుకుంటూనే , మరోపక్క పార్ట్ టైం కింద కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని జేఎస్‌ ఫిష్‌ అండ్‌ చికెన్‌ మార్కెట్‌ అనే ఓ హోటల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యం లో జులై 07 న గుర్తుతెలియని వ్యక్తి అతనిపై కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయాడు.

శరత్‌ను చంపిన నిందితుడిని తాజాగా చికాగో పోలీసులు కాల్చి చంపేసినట్లు తెలుస్తుంది. నిందితుడు ఎక్కడున్నాడో పక్కా సమాచారం అందడంతో పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. దుండగుడు ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టడంతో అతడు పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో దుండుగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు పోలీసు అధికారులకు గాయాలయినట్లు సమాచారం.