బీరుట్ ఘటన పట్ల మహేష్ దిగ్బ్రాంతి

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోమంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో వంద‌కి పైగా మ‌ర‌ణించి ఉంటార‌ని, సుమారు 4వేల‌కి పైగా గాయ‌ప‌డి ఉంటార‌ని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద విస్పోట‌నం యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తుపోయేలా చేసింది. ఈ ఘటన పట్ల ప్రతి ఒక్కరు స్పందింస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన పట్ల మహేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. అత్యంత భయానక సంఘటనగా మహేష్ బీరట్ పేలుళ్లను వర్ణించారు. ఇక మృతుల ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్న మహేష్, ఘటన బాధితుల కోసం దేవుణ్ణి ప్రార్ధించారు. అలాగే తమన్నా ,రకుల్ సైతం ఈ ఘటన పట్ల స్పందించారు. బీరుట్ ప్ర‌మాద భాధితులకి గుండె ధైర్యాన్ని అందించాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని ర‌కుల్ ట్వీట్ చేసింది. త‌మన్నా కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి సంతాపం తెలిపింది.

Absolutely horrifying to see the devastation in the #BeirutExplosion. My prayers for all the people and their families affected by this unfortunate incident.— Mahesh Babu (@urstrulyMahesh) August 5, 2020

I have no words. Please keep Beirut in your prayers.

pic.twitter.com/pthMJOokHo— #PrayForBeirut (@LebaneseProblem) August 4, 2020