ఏడేళ్ల కుమార్తె మృతదేహంతో 8 కి.మీ నడిచిన తండ్రి ..

ఒడిశాలోని గజపతి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముకుంద్ దొర అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తె మృతదేహంతో 8 కిలీమీటర్లు నడచి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తిత్లీ తుఫాన్‌ సమయం నుంచి ముకుంద్‌ దొర కుమార్తె బబిత కనిపించకుండా పోయింది. ఎంత వెతికే చిన్నారి ఆచూకీ కనిపించలేదు. ఈ నెల 17న బాబిత మృతదేహం లభ్యమైంది. కొండచరియలు విరిగిపడటంతో చిన్నారి బాబిత మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.

పోలీసులు వచ్చి డెడ్‌బాడీ ఫోటోలు తీసుకొని వెళ్లారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కైన్‌పూర్ ప్రభుత్వాసుపత్రికి తీసుకురావాలని ముకుంద్‌కు చెప్పి వెళ్లిపోయారు. శవ పరీక్ష నిర్వహిస్తేనే ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది కాబట్టి.. జేబులో ఒక్క రూపాయి లేని ముకుంద్ తన భజాన కుమార్తె మృతదేహాన్ని ఓ సంచిలో మోసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం అందుకున్న అధికారులు.. అప్పటికప్పుడు వాహనం సమకూర్చారు. ఈ వ్యవహారం పట్ల నెటిజన్లు పోలిసుల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.