పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి..పాక్ సైనికులు మృతి..

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ లో పాక్ ఆర్మీ కాన్వాయ్ ఫై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడి లో తొమ్మిదిమంది పాక్‌సైనికులు మృతిచెందారు. బలూచిస్థాన్‌లో సైనిక కాన్వాయ్‌ వెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగినట్టు తెలుస్తుంది. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తామే ఈ దాడికి పాల్పడినట్లు బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అనే సంస్థ, బలోచ్‌ రిపబ్లికన్‌ గార్డ్‌ ప్రకటించుకున్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ పాక్‌లో పర్యటించే కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం సంచలనం గా మారింది.

ఇక మూడు రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లోనిపుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడి పట్ల దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పాల్సిందే అని కోరుతున్నారు. ఇప్పుడు పాక్ కాన్వాయ్ ఫై దాడి జరగడం తో ఇక ఆట మొదలు అయ్యిందంటూ కామెంట్స్ వేస్తున్నారు.