భారత్ భళా.. పాక్ టార్గెట్ 337


వరల్డ్ కప్ లో టీమిండియా అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌కు 337 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (140) అద్భుత శతకం బాదేశాడు. విరాట్‌ కోహ్లీ (77), లోకేశ్‌ రాహుల్‌ (57) అర్ధశతకాలు సాధించారు. దీంతో 337 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.

కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ అరుదైన రికార్డు అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా అతి తక్కువ ఇన్నింగ్‌లలో 11వేల పరుగుల పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో హసన్‌ ఆలీ వేసిన 45ఓవర్‌ రెండో బంతిని బౌండరీకి తరలించి విరాట్‌ ఈ రికార్డును చేరుకున్నాడు.