రొట్టెల పండుగకు పవన్

బారాషాహీద్ రొట్టెల పండుగా గురించి తెలియంది కాదు..లక్షలాది మంది భక్తులు నెల్లూరు కు చేరుకొని ఈ పండుగలో పాల్గొంటారు. స్వర్ణాల చెరువులో రొట్టెలను తింటే కోరుకున్నది జరుగుతుందనేది భక్తుల నమ్మకం. అందుకే దేశవిదేశాల నుంచి తండోపతండాలుగా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.. తాజాగా ఈ ఏడాది కూడా ఈ పండుగా మొదలయ్యింది. ఇప్పటికే చాలామంది బారాషాహీద్ గ్రౌండ్‌కు తరలివస్తున్నారు. దీంతో నెల్లూరు పట్టణం సందడిగా మారింది.

ఈ రొట్టె కోసం జనసేన నేత పవన్ కళ్యాణ్ సైతం నెల్లూరు రాబోతున్నారు. సెప్టెంబరు 23 ఉదయం బారా షహీద్ దర్గాను పవన్ సందర్శించి, రొట్టెలను అందుకోనున్నారు. శనివారం సాయంత్ర హైదరాబాద్ నుంచి నెల్లూరుకు చేరుకోనున్న పవన్, రాత్రికి ఓ హోటల్‌లో బసచేస్తారు. ఆదివారం ఉదయం దర్గాను దర్శించిన అనంతరం వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపొందాలని కోరుకుంటూ స్వర్ణాల చెరువులో తమ పార్టీ ముఖ్యనేతల ద్వారా ‘గెలుపు రొట్టె’ అందుకోబోతున్నట్లు సమాచారం.