పెరియార్ కి ఘోర అవమానం…


ఈ రోజు ప్రముఖ సంఘ సంస్కర్త, ద్రవిడ ఉద్యమ నేత ఈరోడ్ వెంకటప్ప రామస్వామి (పెరియార్) 139వ జయంతి. పెరియార్ జయంతి సందర్భంగా నేడు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఆయన జయంతి నాడే ఆయనకు అవమానం జరిగింది.

తమిళనాడులోని తిరుప్పూరులో ఆయన విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం తలపై చెప్పుల జత ఉంచారు. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

రిపోర్టుల కథనం మేరకు అన్నాసలైలో పెరియార్ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఒకరు తన చెప్పులను విగ్రహంవైపు విసిరాడు. ఈ దాడిలో పెరియార్ విగ్రహం స్వల్పంగా ధ్వంసమైంది. అక్కడే ఉన్న పోలీసులు అతడ్ని వెంటనే పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్‌కి తరలించి అతడ్ని విచారిస్తున్నారు.