స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే..కిలో ఉల్లిగడ్డలు ఫ్రీ..

దేశ వ్యాప్తంగా ఉల్లి ఘాటు నడుస్తుంది..ఉల్లి కొస్తే..కాదు కొనాలంటే ఏడుపు వస్తుంది..అంతలా ఉల్లి ధర పెరిగింది..ప్రస్తుతం కేజీ ఉల్లి ధర రూ. 150 నుండి 180 నడుస్తుంది. దీంతో సామాన్యులు ఉల్లి కొనాలంటే భయపడుతున్నారు. ఇదే అదును చేసుకొని తమ బిజినెస్ పెంచుకుంటున్నాయి మొబైల్ సంస్థలు. స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినవారికి కిలో ఉల్లిగడ్డలు ఫ్రీ గా ఇస్తూ తమ బిజినెస్ పెంచుకుంటున్నారు. ఈ బిజినెస్ పట్టుకొైట్టెలోని ఎస్‌టీఆర్ మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు చేస్తున్నారు.

మొబైల్ షాపును పబ్లిసిటీ కోసం స్మార్ట్‌ఫోన్‌కు ఉచిత ఉల్లిగడ్డల ఆఫర్ ప్రకటించగా..ఎంతోమంది వినియోగదారులను ఆకర్షించిందని షాప్ యజమాని శరవనకుమార్ తెలిపారు. సాధారణంగా నేను రోజుకు 3-4మొబైల్స్ అమ్మేవాడిని. కానీ ఉల్లి ఆఫర్ ప్రకటించిన తరువాత గత రెండు రోజుల నుంచి రోజుకు కనీసం 10 మొబైల్స్ అమ్ముడవుతున్నాయని చెప్పుకొచ్చాడు.