హైదరాబాద్‌లో రెండు రైళ్ళు ఢీ


హైదరాబాద్‌లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. కాచిగూడలోని రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకదానికొకటి మరొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. రైళ్లకు సరైన సిగ్నల్ లేని కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో బోగీలు పక్కకి ఒరిగాయి. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. బోగీల్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. గాయాలపాలైన వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.