తెలంగాణ రాష్ట్రం లో మరో ఘోర రోడ్డు ప్రమాదం..

తెలంగాణ రాష్ట్ర రోడ్లు మృతువు బాటకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాయి. గంటల వ్యవధిలో ఎక్కడో ఓ చోట ప్రమాదం జరుగుతూ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో వలిగొండ ట్రాక్టర్ ప్రమాదం మరచిపోకముందే మరో ఘోర రోడ్డు జరిగింది.

సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగాల వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు మహిళలు మృతిచెందారు. చెన్నారెడ్డిగూడకు చెందిన 10 మంది మహిళలు కూరగాయలు మార్కెట్‌కు తరలించే నిమిత్తం ఆటోలో హైదరాబాద్‌ బయలుదేరారు. వారి ఆటో లింగాల వద్దకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్‌ శ్రీను, సుజాత, మాధవి, మారు, అఫిలి అక్కడికక్కడే మృతిచెందగా… మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌ ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఘటన పట్ల విచారణ సాగిస్తున్నారు.