బాలికపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్


పదో తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు ప్రకాశం జిల్లా ఒంగోలులో అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన 17 ఏళ్ల బాలికకు ఒంగోలుకు చెందిన కారు డ్రైవరు అమ్మిశెట్టి రాము బలవంతంగా తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

తర్వాత స్థానిక సుందరయ్య భవన్‌ రోడ్డులోని శ్రీ సత్యకీర్తి మెడికల్స్‌ పైఅంతస్తుకు తరలించాడు. అక్కడ బాజీ, ఆవుల శ్రీకాంత్‌రెడ్డి, పాత్ర మహేష్‌తోపాటు మరో ముగ్గురు బాలురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను అక్కడే నిర్బంధించి పలుమార్లు దారుణంగా మానభంగం చేశారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి పోలీసులు జైలుకి తరలించారు,

ఇదీలావుంటే బాలికపై అత్యాచార ఘటనలో నిందితులకు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు కొనసాగించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ను ఆదేశించారు.