హైదరాబాద్ నగరంలో బోనాల సందడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించింది ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈరోజు ఉదయం సంప్రదాయ దుస్తుల్లో కుటుంబసభ్యులతో కలిసి బోనమెత్తుకొని సింధూ ఆలయానికి వచ్చారు.
అనంతరం అమ్మవారికి బోనం సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాను ఎప్పూడు అమ్మ ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తుంటానని , అమ్మవారి ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయని ఈ సందర్బంగా తెలిపింది. ఇటీవల చైనాలో జరిగిన వరల్డ్ ఛాంపియన్ షిప్లో పీవీ సింధు రజత పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే.