సోమ్‌నాథ్‌ ఛటర్జీ ఇకలేరు..

గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతున్న లోక్ సభ మాజీ స్పీకర్, కమ్యూనిస్టు యొధుడు సోమనాథ్ ఛటర్జీ ఇకలేరు. కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూసినట్లు డాక్టర్స్ తెలిపారు. ఈయన వయసు 89 ఏళ్లు.

కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఛటర్జీ ఈనెల 7 నుంచి కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న ఆయన గుండెపోటుకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందజేశారు. ఛటర్జీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఈయన మృతి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర సంతాపం తెలియజేశారు. పదిసార్లు లోక్‌సభ సభ్యుడిగా, 2004 నుంచి 2009 వరకూ లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన ఛటర్జీ ఆయన ఒక గొప్ప పార్లమెంటేరియన్ అని గుర్తుచేసుకున్నారు. పార్టీలకు అతీతంగా ఆయనను అంతా గౌరవించేవారని అన్నారు. ఛటర్జీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.