హైదరాబాద్లో ఐపీఎల్ సందడి మొదలయ్యింది. మరో మూడురోజుల్లో 12వ సీజన్ ప్రారంభంకానుండటంతో సన్రైజర్స్ టీమ్ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. తీరికవేళల్లో యాడ్ షూట్స్తో బిజీ అయ్యారు. . తాజాగా ప్రముఖ టీవీ యాంకర్ సుమతో కలిసి డేవిడ్ వార్నర్, భువనేశ్వర్ కుమార్ సందడి చేశారు.
ఓ టీవీ యాడ్లో భాగంగా సన్రైజర్స్ జట్టు సభ్యులతో కలిసి సుమ అలరించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను ఆమె తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. షూటింగ్లో భాగంగా సుమ హైదరాబాద్ ఆటగాడు డేవిడ్ వార్నర్కు దోశె తినిపించారు. ఈ క్రమంలో ఆ ఫొటోలను సుమ తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.