విజయ్ పై.. ఆ వార్త నిజమా ?

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంపై ప్రేక్షకుల ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘అమ్మ’గా కంగనా రనౌత్‌ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో కొన్ని కీలకపాత్రలు పోషిస్తున్న వారి వివరాలను చిత్రబృందం ప్రకటించింది.

అయితే జయలలిత జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరైన శోభన్‌బాబు పాత్రలో విజయ్‌ దేవరకొండ నటించనున్నారని తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ‘తలైవి’ చిత్రబృందం విజయ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే ఇదే అంశంపై పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలి.