విజయవాడ లో దారుణం..బాలికపై అత్యాచారం..

ఓ పక్క అత్యాచారం చేసిన నిందితులను ఎన్ కౌంటర్ చేస్తున్నప్పటికీ కామాంధుల్లో మాత్రం భయం కలగడం లేదు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన దిశ హత్య కేసు నిందితులను ఆమెను ఎక్కడైతే కాల్చి చంపారో అక్కడే ఆ నలుగురు నిందితులను కాల్చి చంపారు పోలీసులు. పోలీసులు చేసిన ఈ పనికి అంత హర్షం వ్యక్తం చేస్తూ..ఇలాంటి అత్యాచారాలు ఇక ఫై జరగవని..అలా అత్యాచారాలు చేయాలంటే భయపడిపోతారని అంత మాట్లాడుకుంటున్న సమయంలో విజయవాడ లో మరో దారుణం జరగడం అందరికి షాక్ ఇస్తుంది.

ఏపీలో విజయవాడ భవానిపురంలో బాలికపై అత్యాచారానికి పాల్డడ్డాడు ఓ కామాంధుడు. పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికను ఇంటికి పిలిచి ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి అతడి తల్లి కూడా సహకరించింది. దీంతో నిందితుడితో పాటు.. అతని తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.