180 మందితో వెళుతూ, ఇరాన్ లో కూలిన ఉక్రెయిన్ విమానం!


ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. ఉక్రెయిన్ నుంచి 180 మంది ప్రయాణికులతో ఇరాన్‌కు వస్తున్న ఈ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖయోమీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కూలిపోయినట్టు స్థానిక మీడియా తెలిపింది.

ఈ విమానాన్ని అమెరికానే కూల్చి వేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా కావాలనే యుద్ధాన్ని కోరుకుంటోందని, ఆ దేశం ఫలితాన్ని అనుభవిస్తుందని ఇరాన్ హెచ్చరించింది. కాగా, ఈ విమానం కూలడానికి తమకు సంబంధం లేదని, తమ రాడార్లు విమానం గమనాన్ని విశ్లేషిస్తున్నాయని అమెరికా అధికారి ఒకరు పేర్కొన్నారు.