దణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (101 ) టెస్టుల్లో 26వ శతకం బాదాడు. దీంతో 109 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 345/3తో పటిష్ఠ స్థితిలో కొనసాగుతోంది.
ఓవర్నైట్ స్కోర్ 273/3తో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన కెప్టెన్, వైస్ కెప్టెన్ బాధ్యతాయుతంగా ఆడుతూ దక్షిణాఫ్రికా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు 290 బంతుల్లో 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగ తొలిరోజు ఆటలో మయాంక్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ పటిష్ట స్థితిలో వుంది