వెండి సింహాలది దొంగల పనే

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర దేవస్థానానికి చెందిన వెండి రథానికి అమర్చిన వెండి సింహాలు చోరీకి గురైనట్లు ఆలయ అధికారులు ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఈనెల 13న రథాన్ని పరిశీలిస్తుండగా వెండి తాపడం చేసిన నాలుగు సింహాల విగ్రహాలలో మూడు మాయమైన విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే… ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఈ వెండి రథాన్ని 2002లో రూపొందించారు. అమ్మవారి సింహ వాహనానికి గుర్తుగా రథానికి సింహాల విగ్రహాలను అమర్చారు. ఒక్కో విగ్రహానికి 10 కిలోల వెండి తాపడం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.