ఇది తెలుగు జాతికి వచ్చిన వారెంట్‌

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో గతంలో చేపట్టిన ఆందోళనకు గాను ఏపీ సీఎంకు ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ అంశాన్ని ఏపీ కాంగ్రెస్ పార్టీ సైతం తప్పుబట్టింది. బాబుపై కేసులు, నోటీసులు జారీ చేయడం ముమ్మాటికీ తప్పేనని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు.

అలాగే చంద్రబాబుకు వచ్చిన వారెంట్‌ తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి వచ్చిన వారెంట్‌గా భావిస్తున్నానని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం కలుగుతుందని చంద్రబాబు రైతుల పక్షాన వెళ్లారన్నారు. 2007లో దేవేందర్‌గౌడ్‌ నాయకత్వంలో తాను కూడా వెళ్లానన్న మంత్రి.. మాకు ఇవ్వని నోటీసులు ముఖ్యమంత్రికి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.