కమలం దగ్గరికి అంబికా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి ఇండదా..అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం చెంతకు చేరగా..ఇప్పుడు మరో కీలక టీడీపీ నేత కమలం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, అంబికా కృష్ణ టీడీపీ పార్టీ కి గుడ్ బై చెప్పబోతున్నారు.

త్వరలో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇక పార్టీ నుండి ఒక్కో నేత వెళ్లిపోతుంటే బాబు కు దిగులు పట్టుకుంది. వీరు మాత్రమే కాదు ఈ ఎన్నికల్లో గెలిచిన 23 మందిలో చాలామంది పార్టీ కి గుడ్ బై చెప్పి..బీజేపీ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలోనే నేతలు ఇలా పార్టీని వీడటం కలవరపెడుతోంది. చంద్రబాబు రేపు విదేశాల నుంచి తిరిగిరానున్నారు. మరి ఆయన వచ్చాక ఎంతమంది ని ఆపుతాడో చూడాలి.