ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బావ క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్కుమార్ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు సమీపంలో అనిల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డుపక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో అనిల్ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు.
ప్రమాద సమయంలో కారులో అనిల్కుమార్తో పాటు గన్మెన్లు, డ్రైవర్ ఉన్నారు. ఈ విషయం తెలియగానే స్థానిక వైసీపీ నాయకుడు, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాడు. అనిల్తో పాటు మిగిలిన వారి యోగక్షేమాల గురించి ఉదయభాను అడిగి తెలుసుకున్నారు.