కేసీఆర్ , మోడీ లతో జగన్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి జగన్ సత్తా చాటిన సంగతి తెలిసిందే. వైసీపీ విజయం పట్ల ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ నెల 30 న జగన్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీ లతో జగన్ సమావేశం కానున్నారు. ఈరోజు వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుండగా.. ఈ సమావేశం అనంతరం హైదరాబాద్‌కు రానున్నారు.

అలాగే 26 న ప్రధాని మోడీ ని కలిసి 30న విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించబోతున్నారు. గురువారం మోడీ ట్విటర్ ద్వారా జగన్ కు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు..‘ ప్రియమైన వైఎస్‌ జగన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన మీకు శుభాకాంక్షలు. మీ పదవీ కాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు ఇవే శుభాకాంక్షలు’ అని తెలుగులో ట్వీట్‌ చేశారు.