మహిళకు ఏపీ సీఎం మరో గిఫ్ట్ ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరుసగా వరాలు అందిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా దిశ బిల్లు ను ప్రవేశ పెట్టి మహిళా భద్రతే మా లక్ష్యం అని తెలిపిన జగన్..మరో నిర్ణయం ప్రకటించి తన గొప్ప తనాన్ని చాటుకున్నాడు. 2020 ఏడాది మార్చిలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు మహిళలను ఎంపిక చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. పదవుల పంపకం విషయంలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

ఈ రెండు స్థానాలను ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలను కేటాయించాలనే భావనలో ఉన్నట్లు సమాచారం. గవర్నర్ నామినేట్ చేయనున్న ఈ రెండు స్థానాలకు ఒక ఎస్సీ, ఒక బీసీ మహిళ పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉందని… ఇందుకు పలువురు పేర్లను పరిశీలిస్తున్నారని వినికిడి.