పవన్ కళ్యాణ్ అంటే పిచ్చికుక్క – వైసీపీ ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిత్యం వైసీపీ ప్రభుత్వం ఫై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలకు వైసీపీ కూడా అంతే ఘాటుగా రిప్లై ఇస్తుందనుకోండి. తాజాగా పీకే అంటే అభిమానులకు , జనసేన కార్య కర్తలకు పవన్ కళ్యాణ్ కావొచ్చు..నాకు మాత్రం పీకే అంటే పిచ్చికుక్క అని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. తాజాగా ఐటీ దాడులపై వస్తున్న రాజకీయ విమర్శలపై మీడియా తో మాట్లాడిన ఈయన..తెలుగు దేశం నేతలతో పాటు పవన్ కళ్యాణ్ ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు.

బుద్ధిలేని లొల్లి వెంకన్న.. మెదడులేని మేధావి యనమల రామకృష్ణుడు.. అచ్చోసిన ఆంబోతు లాంటి అచ్చెన్నాయుడు, బొంకలేక బొంకే బొచ్చయ్య చౌదరి, సొల్లు దేవినేని ఉమ, లోకజ్ఞానం లేని లోకేష్ అంటూ వ్యాఖ్యానించిన ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు… పీకే అంటే మీకు పవన్ కల్యాణ్ కావొచ్చు.. కానీ, పీకే అంటే నాకు పిచ్చికుక్క అని వ్యాఖ్యానించారు. రాజకీయ పరిజ్ఞానం లేని పీకే వంటి వారు కరోనా వైరస్ కన్నా ప్రమాదకరమని సంచలన వ్యాఖ్యలు చేశారు.