పవన్..కేఏ పాల్ ను చూసి భయపడ్డాడట…

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ను చూసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పారిపోయాడట..ఈ మాట స్వయంగా పాల్ గారే అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల చాల దగ్గరకు వచ్చింది. ఈ నేపథ్యంలో నేతల మాటల యుద్ధం పెరిగిపోతుంది..పైన వేడి..లోపల ఎన్నికల టెన్షన్ ఈ రెండింటితో నేతల్లో అసహనం పెరిగిపోతుంది.. ఇలాంటి నేపథ్యంలో పాల్ చేసే కామెంట్స్ జనాలకు నవ్వులు తెప్పిస్తుంది..ప్రపంచం మొత్తం తన అనుసంధానం లోనే నడుస్తుందంటూ గొప్పగా చెప్పుకునే పాల్..ప్రస్తుతం ఏపీ ఎన్నికల బరిలో తన పార్టీ ని నిలబెట్టారు.

ప్రచారంలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ , బాబు.. ఇలా అందర్నీ టార్గెట్ చేస్తూ తనదయిన స్టైల్ లో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోసారి టార్గెట్ చేసారు. మొన్నటికి మొన్న పవన్ డాన్స్ పట్ల కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచినా పాల్..తాజాగా తన స్థానం ఫై సెటైర్లు వేశారు.

‘పవన్ తొలుత పాలకొల్లు నుంచి పోటీ చేయాలని అనుకున్నాడు. కానీ నేను కూడా పాలకొల్లు నుంచి పోటీ చేస్తున్నట్టు తెలియగానే.. పారిపోయి భీమవరం నుంచి బరిలో దిగుతున్నాడని వ్యాఖ్యానించారు. పవన్ తనకు తమ్ముడిలాంటి వాడని, నాగబాబు కూడా తనకు తమ్ముడేనని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.