ఫ్యాన్ కిందకు కావూరి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల జోరు మొదలుకాబోతుంది. దీంతో నేతలంతా పలు పలు పార్టీల్లోకి వలసలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటికే అధికార పార్టీ తెలుగుదేశం నుండి కీలక నేతలు వైసీపీ లో జాయిన్ అవుతూనే ఉన్నారు. తాజాగా వైసీపీ కి మరో బలం పెరగబోతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కావూరి సాంబశివరావు వైసీపీలో జాయిన్ అవుతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం కావూరి బీజేపీలో ఉన్నారు. ఏపీలో బీజేపీ పరిస్థితి అందరికి తెలిసిందే కదా. దీంతో ఆ పార్టీలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఫిక్స్ అయిన కావూరి.. వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కావూరి ఎంట్రీకి జగన్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.