జగన్ ను పచ్చి బూతులు తిట్టిన మాధవీలత..

ఈ మధ్యనే అతి తీవ్రాలో చనిపోతానంటూ నానా హడావిడి చేసిన బీజేపీ యువ నేత, హీరోయిన్ మాధవీలత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని ఓ రేంజ్ లో తిట్ల దండకం చేసి వార్తల్లో నిలిచింది. నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి మాధవీలత..ఆ తర్వాత అవకాశాలు తగ్గడం తో ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజవకర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి ఎంపీ గా పోటీ చేసి ఓటమి చెందింది.


ప్రస్తుతం రాజకీయాలతో వార్తల్లో నిలుస్తున్న ఈమె తాజాగా తన ఫేస్బుక్ లో ‘ఏమిరా ఇది.. జగన్ రెడ్డి!! కర్నూల్ కోర్టు తరువాత కట్టుకుందువు కాని.. ముందు ఉన్న కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో దిశ చట్టం అమలు చేయించు. నువ్వు నీ పిచ్చి తుగ్లక్ గోల’ అంటూ జగన్ పై నోరు పారేసుకుంది. ఇంతలా జగన్ ఫై మాధవి అగ్రహాయించడానికి కారణం..కర్నూల్ బండిమెట్టలో ఆరేళ్ల బాలికపై ఖాజా మోదీన్ అనే వ్యక్తి అత్యాచారం చేశారంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ రావడంతో దాన్ని షేర్ చేస్తూ జగన్‌పై ఈ విధమైన కామెంట్స్ చేశారు మాధవీలత.