పవన్ ఫై ప్రేమను కురిపించిన హీరోయిన్

నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన నటి మాధవీలత..ఈ మధ్యనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఏకంగా గుంటూరు వెస్ట్ నియోజవకర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగింది. ఎన్నికల్లో గట్టి ప్రచారమే చేసినప్పటికీ.. కేవలం 1989 ఓట్లు మాత్రమే ఈమెకు పడ్డాయి. దీంతో డిపాజిట్ కోల్పోయింది. ఫలితాల పట్ల తనకు ఏమాత్రం బాధలేదని..కాకపోతే పవన్ కళ్యాణ్ ఓడిపోవడమే బాధ కలిగించిందని తన పేస్ బుక్ ద్వారా తెలిపింది.

ఇక ఆమె ఎలా స్పందించిందంటే..

పవన్ ఓటమి బాధించింది: ‘‘నేను ఓడిపోతానని నాకు తెలుసు. పార్టీకి తెలుసు, మీకు తెలుసు. ముందుగానే తెలుసుకుని బాధ్యతగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఎక్కడా నేను గెలుస్తాననే మాట వాడలేదు. మోదీ మళ్లీ రావాలనే నేను కోరుకున్నా.. వచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ ఓటమి నాకు వింతగా విడ్డూరంగా ఉంది. డబ్బు ఇస్తేనే ఓటు వేస్తాము. మాకు నిజాయతీపరులు వద్దు అని భలే చెప్పారుగా’’ అని ఆమె ఫేస్‌బుక్‌లో పేర్కొంది. ‘‘బీజేపీ డబ్బులివ్వలేదు. మోదీ ప్రేమతో ఓట్లు సంపాదించారు. పీకే ఎందుకు గెలవలేదు? పీకే అభిమానులకు ఏమైంది? నాకు బాధగా ఉంది’’ అని తెలిపారు.

చదువు.. నీతి.. వద్దని చెప్పేశారుగా: ‘‘చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలనేది మీరే. మాజీ జేడీ లక్ష్మీ నారాయణ వచ్చారు? ఎందుకు ఓడించారు? విద్యార్థులు ఏమయ్యారు? మీ ఓట్లు ఏమయ్యాయి? డబ్బు కులం, కావాలని నిరూపించారుగా. చదువు, నీతి వద్దని చెప్పేసారుగా?’’ అని మరో పోస్టులో తెలిపింది.

ఈవీఎంలు ట్యాంపరింగ్ ఆరోపణలపై స్పందిస్తూ.. ‘‘ఈవీఎంల మ్యాజిక్ వల్ల బీజేపీ గెలించిందని అంటున్నారు. అదే నిజమైతే ఏపీలో బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు ఎందుకు? ఈవీఎంలను ట్యాంపరింగ్‌లో మోదీ ప్రమేయం ఉంటే.. ఓడిన మూడు రాష్ట్రాల్లో కనీసం 10 సీట్లు బీజేపీకి వచ్చేవి. తెలివిగా ఆలోచించండి. ఇది ప్రజల నిర్ణయం. ఈవీఎంలది కాదు. కౌంటింగ్ సక్రమంగానే జరిగింది. స్లిప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.’’ అని తెలిపారు.