జగన్ కు కంగ్రాట్స్ చెప్పిన మహర్షి..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్న జగన్ మోహన్ రెడ్డి కి కంగ్రాట్స్ తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం సాధించి నూతన ప్రభుత్వాన్ని ఏర్పటు చేయబోతున్న వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి శుభాకాంక్షల వెల్లువ ఆకాశానికి తాకుతుంది. రాజకీయ, బిజినెస్ , సినీ తారలు ఇలా ప్రతి ఒక్కరు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని సాధించిన జగన్‌కు శుభాకాంక్షలు .. మీ పదవి కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో గొప్ప విజయాలను సాధిస్తుందని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. అలాగే ప్రధాని మోడీ కి సైతం తన విషెష్ అందించారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు విదేశీ టూర్ లో ఉన్నాడు. రీసెంట్ గా మహేష్ నటించిన మహర్షి చిత్రం అఖండ విజయం సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో సక్సెస్ ను ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నాడు.